Don't wanna be here? Send us removal request.
Video
youtube
Neuro Scientists Annual Conference
25th Annual conferrence of AP NEURO Scientists Association.. Pre Conf.WorkShop:8th,9th,10th June 2018 Venue:Rangaraya Medical College Auditorium,Kakinada
0 notes
Photo

Industry Awareness programme on Financial Support to MSMEs in ZED Certification Scheme at Dwmw meeting hall Vidhana gowthami kakinada on 30-1-2018
0 notes
Text
జనవరి 31న పౌర్ణమి గరుడసేవ రద్దు : తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గరుడసేవ బుధవారం నాడు రద్దయింది. చంద్రగ్రహణం కారణంగా పౌర్ణమి గరుడసేవను రద్దు చేసినట్టు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వార్తా విశేషాల కోసం news.tirumala.org వెబ్సైట్ను సంప్రదించగలరు.
0 notes
Text
జనవరి 31న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత : చంద్రగ్రహణం కారణంగా జనవరి 31వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివుంచుతారు. జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుంది. చంద్రగ్రహణం కారణంగా రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. విఐపి బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని కూడా మూసివేస్తారు. అన్నప్రసాదాల వితరణ లేని కారణంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలోకి భక్తులకు అనుమతి ఉండదు. ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా టిటిడి రద్దు చేసింది. శ్రీవారి ఆలయం ఉదయం, రాత్రి కలిపి దాదాపు 5 గంటల పాటు మాత్రమే తెరిచి ఉంటుందని, భక్తులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తమ తిరుమల యాత్రను సాగించాలని టిటిడి కోరుతోంది.
0 notes
Text
శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి తిరుమలలో బుధవారం జరుగనున్న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటికి టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతిఏటా మకరమాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారి ఆలయానికి 6 మైళ్ల దూరంలో ఉన్న ఈ తీర్థంలో ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయం నుంచి వైదికులు మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 10గం||లకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకుంటారు. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో సృష్టించినట్టుగా పేరొందిన ఈ పుణ్యతీర్థంలో ఆర్చక స్వాములు, ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం తీర్థం ఒడ్డున కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్య సమర్పణ గావిస్తారు. ఈ తీర్థానికి వెళ్లే భక్తులకు పాపవినాశనం డ్యామ్ వద్ద పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు పంపిణీకి ఏర్పాట్లు చేపట్టారు.
0 notes
Photo



East Godavari District collector review meeting on SC, ST, BC Welfare Department at Vidhana gowthami kakinada on 30-1-2018
0 notes
Photo

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో మహాత్మగాంధీజీ వర్ధంతి సందర్ఙంగా గాంధి చిత్రపటానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు పూలమాల వేసి నివాళ్లర్పించారు. విశ్వవిద్యాలయంలో గల అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్, డీన్స్, అధ్యాపకులు అందరూ సమావేశ మందిరంలో జాతిపిత మహత్మగాంధి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనకు నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా వీసీ ముర్రు ముత్యాలు నాయుడు మాట్లాడుతూ మహాత్మగాంధీ యువతరానికి ఆదర్శం కావాలని అన్నారు. సత్యం, అహింస అనే ఆయుధాలతో దేశ స్వంతంత్ర సాధనకు కృషి చేసారని తెలిపారు. నేటి యవతరం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు, వారి ప్రగతికి గాంధీ పాటించిన ఈ రెండు సూత్రాలు మార్గదర్శంకం అవుతాయని పెర్కొన్నారు. అలాగే విశ్వవిద్యాలయంలో ఆర్స్ట్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎడ్యూకేషన్ కళాశాలల్లోని ఆయా విభాగాలలో రెండు నిమిషాలు నిశబ్ధం పాటించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ ఆచార్య కె.శ్రీరమేష్, విద్యాశాఖ కళాశాల ప్రిన్సిపల్ డా.కె.సుబ్బారావు, డీన్స్ ఆచార్య వై.శ్రీనివాసరావు, డా.ఎ.మట్టారెడ్డి, ఈ.సీ మెంబర్ డా.పి.విజయనిర్మల, రిజిష్ట్రార్ డా.టి.అశోక్, డిప్యూటి రిజిష్ట్రార్ ఎస్.లింగారెడ్డి, డా.ఎం.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
0 notes
Photo

ఫిబ్రవరి 5,6లో మేనేజ్.మెంట్ ఫెస్ట్
పోసర్ ను ఆవిష్కరించిన వీసీ ముత్యాలు నాయుడు
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మేనేజమెంట్ విభాగం ఆధ్వర్యంలో 8వ మేనేజ్.మెంట్ వీక్ కార్యక్రమన్ని ఫిబ్రవరి 5,6 తేదిలలో “బిజ్ బ్లేజ్ 2కె18(Biz-Blaze 2k18)” పేరుతో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు తెలిపారు. మంగళవారం దీనికి సంబందించిన పోస్టర్ ను వీసీ ఆవిష్కరించారు. విద్యార్థులలోని సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యన్ని పెంపొందించే విధంగా వివిధ రకాలైన కార్యక్రమలు, ఆటల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వీసీ ముత్యాలు నాయుడు తెలియజేసారు. ఉభయ గోదారవి జిల్లాలలోని అనుబంధ కళాశాలల నుండి మరియు రాష్ట్రంలోని ఇతర ఎం.బి.ఎ కళాశాలల నుండి విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చునని ఎకడమిక్ డీన్ ఆచార్య ఎస్.టేకి తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఫెస్ట్ లో బిజినెస్ గెమ్స్, మైడ్ గెమ్స్, ఫన్ గెమ్స్, బి.ప్లాన్ వంటి కార్యక్రమాలు ఉంటాయని విభాగాధిపతి డా.ఎన్.ఉదయబాస్కర్ అన్నారు. వీటికి సంబందించిన మరిన్ని వివరాలకు 7306663336, 9533722333నెంబర్లను సంప్రదించాలని పెర్కొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డీన్స్ ఆచార్య ఎస్.టేకి, డా.పి.సురేష్ వర్మ, విభాగాధ్యపకులు డా.ఎన్.ఉదయబాస్కర్, డా.పి.ఉమమహేశ్వరి, జి.రాజెంద్రప్రసాద్, డా.ఎ.ఎస్.పద్మవల్లి, రవిశంకర్, ఎ.శ్రీనివాసరావు, డా.ఎం.రమేష్, అలిస్ జాయ్, కె.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
0 notes
Text
Second intermediate practical examination will be conducted from 1-2-2018 to 21-2-2018 except 13th febraury (holiday on account of Maha sivarathri) Timings:9am to12pm,2pm to 5pm
Main exams Will be from february28 to march 19th Timing:(9am to 12 Pm)
RDO Venkateswara Rao kakinada
Andhra Pradesh
0 notes