నాగర్ కర్నూల్ లో ఆర్ఎంపి వైద్యుడి లైంగిక వేధింపులు…
సామాజిక సారథి , నాగర్ కర్నూల్: నీ భర్త వల్ల పిల్లలు పుట్టరు నా దగ్గరికి రా అని తల్లి ముందే ని సిగ్గుగా మాట్లాడి లైంగికంగా వేధించాడు ఒక కామాంధ ఆర్ఎంపి వైద్యుడు
.. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రికి ఎదురుగా మినీ ట్యాంక్ బండ్ రోడ్డు నగల న్యూ లైఫ్ ఆసుపత్రి ఆర్ఎంపి వైద్యుడు సమీర్ వద్దకు తాడూరు మండలం యత్మతాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ తల్లితోపాటు జ్వరం వస్తే…
0 notes
బెంగళూరులో ‘స్టోగో ఫెస్ట్’
బెంగళూరు: జాతీయ స్థాయిలో పేరొందిన టెక్ ఫెస్ట్ ‘స్టోగో ఫెస్ట్ 2024’ ఈసారి బెంగళూరులో జరగనుంది. డిసెంబర్ 9, 10 తేదీల్లో నగరంలోని ఆర్ఆర్ విద్యాసంస్థ క్యాంపస్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు జయేష్, లిండా వివరించారు. ‘అత్యాధునిక సాంకేతిక వినియోగం.. మానవాభివృద్ధి’ ప్రధాన లక్ష్యంగా ఈ ఫెస్ట్ ప్రతి ఏడాది ఒక్కొక్క రాష్ట్రంలో జరగనుంది. కాగా, ఈ ఏడాది పిల్లల సంరక్షణలో కృత్రిమమేథ,…
0 notes
గ్రామాల నుంచి బీఎస్పీని తరిమికొట్టాలి
ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం
సామాజికసారథి, నాగర్ కర్నూల్: ఎస్సీ వర్గీకరణను సమర్థించే ప్రతి మాదిగ బిడ్డ గ్రామాల నుండి బీఎస్పీని తరిమికొట్టాలని ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కరిగళ్ల దశరథం పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల పార్టీ అనుకున్నాం కానీ అది మనపార్టీ కాదు అగ్రకులాలకు కొమ్ముకాస్తున్న పార్టీ అని తేలిపోయిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు…
0 notes
ఇండ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దు
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఇప్పుడిప్పుడే నిండుగా ప్రవహిస్తున్నాయి. భారీగా వానలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బిజినేపల్లి పోలీసులు పరిసర గ్రామాల ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఏ పని లేకుండా బయటికి రావొద్దని…
0 notes
సాయం చేసినందుకు …కోరిక తీర్చాలంటున్నడు
* భర్త లేని ఒంటరిమహిళ పై యువకుడు అఘాయిత్యం* బిజినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
సామాజికసారథి, నాగర్ కర్నూల్: కట్టుకున్న భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ఉన్న ఇద్దరు సంతానాన్ని పోషించుకునేందుకు తన భర్త తరపు పొలం ఆసరా అవుతుందనుకున్నది ఆ భార్య. కాని తన దాయాదులు న్యాయంగా తనకు రావాల్సిన తన భర్త పొలాన్ని ఇవ్వకుండా ముప్ప తిప్పలు పెట్టడంతో సాయం కోసం గ్రామంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న ఓ…
0 notes
కందనూలుకు తీరనున్న కష్టాలు
# పెరిగిన నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీ పడకలు# 300 పడకల నుంచి 605 పడకలకు పెంపు# ఫలించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కృషి# హెల్త్ మినిష్టర్ దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే
సామాజికసారథి, నాగర్ కర్నూల్: కందనూలు ప్రజలకు వైద్యం కష్టాలు తీరనున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ వద్ద మెడికల్ కాలేజీ పడకలు భారీగా పెరుగనున్నాయి. ఇదివరకు ఇక్కడ కేవలం 300 పడకల ఆసుపత్రి ఉండగా రోగులకు…
0 notes
బిజినేపల్లిలో విషపు రెడ్డి!
ఎమ్మెల్యే అనుచరుడి పేరుతో అడ్డగోలు దందాలు
మూడు గ్రామాలపై పెత్తనం చెలాయిస్తున్న దందాలరెడ్డి
అడ్డుకట్ట వేయకపోతే అధికార కాంగ్రెస్ కు గట్టిదెబ్బే
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ లీడర్ నిర్వాకం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడినంటూ ఆ లీడర్ చేస్తున్న అరాచకాలు అన్నీఇన్ని కావు. అధికార పార్టీ లీడర్ నంటూ…
0 notes
మిద్దె కూలి తల్లీకూతుళ్లు, కొడుకు మృతి
నాగర్ కర్నూల్ జిల్లాలో దుర్ఘటన
వనపట్లలో తీవ్ర విషాదఛాయలు
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ మండలం పరిధిలోని వనపట్లలో ఆదివారం రాత్రి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన తల్లి, పిల్లలు నలుగురు మృతిచెందారు. స్థానికుల కథనం.. గ్రామానికి చెందిన గొడుగు పద్మ (26), భర్త భాస్కర్.. ఇద్దరు కూతుళ్లు పప్పి(6), వసంత(6), కుమారుడు…
View On WordPress
0 notes
గవర్నమెంట్ టీచర్లు సమయ పాలన పాటించాలిప్రైవేట్ స్కూళ్లల్లో అడ్డగోలు ఫీజులపై చర్యలేవిడీఈవో,
ఎంఈఓ లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలివిద్య,
వ్యవసాయ శాఖలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రివ్యూ
సామాజిక సారథి, జిల్లాలో గవర్నమెంట్ స్కూళ్ల టీచర్లు తప్పకుండా సమయ పాలన పాటించాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి లు సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్య, వ్యవసాయ శాఖలపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్…
View On WordPress
0 notes
ప్రభుత్వ స్థలాలను అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి
పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేసిన పాలెం కాంగ్రెస్ నాయకులు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: బిజినేపల్లి మండలం పాలెం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలను అమ్ముకుంటున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలెం పేరుకే మేజర్ గ్రామపంచాయతీ అని పాలకులు, ప్రజాప్రతినిధుల…
View On WordPress
0 notes
వెల్గొండ లో బి ఆర్ ఎస్ కు షాకు
సామాజిక సారథి , నాగర్ కర్నూల్ : బిజీన పల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన వార్డు నెంబర్ మల్లేష్ , మర్రిన్న దళితదండు నాయకులు బిఆర్ఎస్ పార్టీ లో నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరినారు .ఆదివారం నాగర్ కర్నూల్ లో ఏమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఏమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గుట్టి కీ చేరినారు. గ్రామంలో లో బి ఆర్ ఎస్ కు బిగు షాకు జరిగింది . పార్టీ లో చేరిన వారు రాజు, తిరుపాల్, వారి వెంట…
View On WordPress
0 notes
సీరియల్ కిల్లర్ కేసుపై పోలీస్ ఉన్నతాధికారుల నజర్
. వనపర్తి జిల్లా రేవల్లి హత్య కేసు వివరాల పై ప్రత్యేకంగా ఆరా. 2020 లోనే సీరియల్ కిల్లర్ కు సహకరించిన వనపర్తి జిల్లా పోలీసులు. కాసుల కక్కుర్తితో సీరియల్ కిల్లర్ పై దృష్టిపెట్టని పోలీసులు. ఇదే అదునుగా మరింత రెచ్చిపోయిన సీరియల్ కిల్లర్. 2022 లో నాగర్ కర్నూల్ జిల్లాలో మరి కొందరి బలి
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ హత్యల కేసు మరోసారి తెరపైకి…
View On WordPress
0 notes
ఖాకీల నీడన పేకాట?
పోలీసుల కనుసన్నల్లో పత్తాలాట?
ముడుపులిచ్చి మరీ పేకాట ఆడుతున్నట్లు ప్రచారం
రిం���్ మాస్టర్లుగా ఇద్దరు బడా నేతలు
ఆటకు రూ.వెయ్యి చొప్పున వసూలు..
బిజినేపల్లి మండలం కేంద్రంగా భారీ గేమ్
సుదూర ప్రాంతాల నుంచి జూదరుల రాక
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పేకాట మూడుపూలు, ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. పోలీసు అధికారులకు ముడుపులు ఇచ్చి జూదరులు మరీ…
View On WordPress
0 notes
గుడ్లనర్వలో గంజాయి కలకలం
పోలీసుల అదుపులో ఇద్దరు యువకులుసామాజికసారథి, నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామంలో గంజాయి కలకలం రేగింది. ఇద్దరు యువకులు సిగరెట్లలో గంజాయి నింపుకొని సేవిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు శనివారం నాగర్ కర్నూల్ సీఐ కనకయ్య గౌడ్ తెలిపారు. కాగా నాగర్ కర్నూల్ జిల్లాలో చాపకింద నీరులా గంజాయి వాడకం…
View On WordPress
0 notes
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యపై సర్క్యులర్ జారీ చేయాలి
టి యు డబ్ల్యూ జే -హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు..సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలను ఉచిత విద్యను అందించడానికి సర్కులర్ జారీ చేయాలని పియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు కానాపురం ప్రదీప్ ఐజేయు జాతీయ నాయకుడు జెమినీ సురేష్ ల ఆధ్వర్యంలో జిల్లా…
View On WordPress
0 notes
ద్యావుడా…. ఏకంగా రూ.21.47 కోట్ల కరెంట్ బిల్లు!
సామాజికసారథి, నాగర్ కర్నూల్: అధికారుల తప్పిదాలు కొన్నిసార్లు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా అచ్చంగా ఇలాంటిదే మరి. వివరాల్లోకెళ్తే.. ఓ ఇంటిలో సాధారణంగా నాలుగు లైట్లు. ఓ మూడు ఫ్యాన్లు, మొబైల్ ఛార్జర్స్.. ఎలక్ట్రికల్ ఇస్త్రీ పెట్టే, కూలర్, లేదంటే ఏసీ ఉంటుంది. వంటింట్లో కరెంట్ హీటర్, మిక్సింగ్ గ్రౌండర్ వాడుతుండటం మనందరికీ తెలిసిందే. అయితే…
View On WordPress
0 notes
పాలెంలో పట్టపగలే చోరీలు
సామాజికసారథి, బిజినేపల్లి: పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు.. తాళం వేసిన ఇళ్లను, ఇంట్లో అందరు ఉండగానే టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. అటు ఇటు చూసి అందినకాడికి దోచుకెళ్తున్నారు. బిజినేపల్లి మండలం పాలెంలో మూడు రోజుల క్రితం జరిగిన చోరీలతో విస్తుగొల్పుతున్నాయి. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జగన్ ఇంట్లో దొంగలు పడి 3 తులాల బంగారు నగలు, రూ.20వేల నగదును ఎత్తుకెళ్లారు. అంతలోనే ఓ మాజీ ఆర్మీ…
View On WordPress
0 notes