దహన సంస్కారాలకు దమిడి లేని ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేదెవరు?
గద్వాల పట్టణం నడిబొడ్డున, నవరంగ్ టాకీస్ ఎదురుగా ఉన్న బస్తీలో బోయ ఆంజనేయులు కుటుంబం నివసిస్తోంది. వారి కుటుంబ సభ్యులంతా(4) హోటల్లలో సర్వర్లుగా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆ కుటుంబంలో పెద్ద కొడుకు అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి మృతి చెందాడు. ఇవాళ ఎవరైనా దాతలు కరుణిస్తే ఆంజనేయులు అంత్యక్రియలు జరుగుతాయి. గంజిలో పనిచేస్తూ వాళ్ల నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడుగుతూ, ఒక బిడ్డను ముగ్గురు కొడుకులను సాకింది. కానీ వాళ్లకు బడి అంటే ఏందో తెలియదు. గుడి అంటే ఏందో తెలీదు. అలాంటి వాతావరణంలో పెరిగారు. అంతపెద్ద గద్వాల టౌన్ లో ఇలాంటి పేద కుటుంబాలు కోకొల్లలు. మురికి వాడలు బాగు పడేది ఎన్నడు? వారిని పట్టించుకునేది ఎవరు? పేదలకు అండగా ఉంటామనే స్థానిక శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే గద్వాల నగరంలో ఈ దుస్థితి ఉంది. దాతలు సంప్రదించవలసిన నంబర్ సురేష్ నాయుడు 8121315257(ఆంజనేయులు కుమారుడు)
గద్వాల ఎమ్మెల్యే విషయంలో హైకోర్టు ఉత్తర్వులను పాటించి తక్షణమే.. డీకే అరుణను ఎమ్మెల్యేగా నోటిఫై చేస్తూ గెజిట్ ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. హై కోర్ట్ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి, అసెంబ్లీ కార్యదర్శి కి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ లేఖతో పాటు హైకోర్టు ఉత్తర్వులను జత చేసింది. డీకే అరుణ 2018 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ […]
Actress Manchu Lakshmi's 'Teach for Change' NGO organization adopts 30 Govt Schools in Jogulamba Gadwal District: It's one of the TJ News24x7 victory
తెలంగాణ జర్నలిస్ట్ న్యూస్(టీజేన్యూస్24×7) వార్తలకు మంచు లక్ష్మీకి చెందిన ఎన్జీవో సంస్థ స్పందన!
జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ రెషిడెన్సిషల్ పాఠశాలల దుస్థితిపై తెలంగాణ జర్నలిస్ట్ న్యూస్ (టీజేన్యూస్24×7) ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చింది. తాజాగా వడ్డేపల్లి కేజీబీవి బాలిక దుస్థితిపై ఆడియో కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ప్రముఖ సినీనటి, మంచు లక్ష్మీ తన ఎన్జీవో సంస్థ టీచ్ ఫర్ ఛేంజ్ ఆధ్వర్యంలో…
నేను ఏ తప్పు చేయలేదు నాన్న! వారిని మాత్రం వదలొద్దు
నేను ఏ తప్పు చేయలేదు నాన్న! వారిని మాత్రం వదలొద్దు
అమ్మాయిలు ఎంత సున్నిత మనస్కులో మరోసారి ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఓ అబ్బాయితో ఉన్న ఫొటోని ఫేస్బుక్లో ఫ్రెండ్స్ షేర్ చేయగా.. యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్లో చోటు చేసుకుంది. చనిపోయే ముందు కూడా తండ్రి తనని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటాడో అని మనో వేదనకి గురైన బాధిత యువతి.. తాను ఏ తప్పు చేయలేదంటూ ఓ లేఖ రాసి మరీ నిజాయతీని నిరూపించుకుంది.
అసలు ఏం జరిగిందంటే? గద్వాల మండలం…
ప్రెస్క్లబ్లో బతుకమ్మ సందడి
* ఆడిపాడిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత, మేయర్ విజయలక్ష్మి
వేగుచుక్క న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 2: బతుకమ్మ సంబరాలు సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ప్రెస్క్లబ్లో మహిళా పాత్రికేయులు బతుకమ్మలను తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డిప్యూటీ మేయర్…
ఊరుకొండపేటలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము అతి పురాతనమైంది, రోగాల నుండి ఉపషమనం కలిగించు దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయమునకు రెండు వైపులా రెండు ఎత్తైన కొండలు ఉండుటచే వాటికి ఊరుకొండలు (పెద్దకొండలు) అని పిలిచెవారు. ఆ కొండల మధ్యలో వెలసిన గ్రామమే ఊరుకొండపేట.
ఆలయ చరిత్ర.......
నిజం పాలనలో శిల్పులు తమ గ్రామాల్లో దేవాలయాలు నిర్మించుకోవడానికి విగ్రహాల కోసం కొండల వెంబడి వెతుకుసమయంలో ఊరుకొండపేట కొండపై లభించిన పెద్ద శిలపై ఆంజనేయస్వామి విగ్రహాన్ని మలిచారు. ఆ శిల్పాన్ని గట్టుఇప్పలపల్లికి తరిలించే సమయంలో ఊరుకొండపేట వద్ద విగ్రహం తీసుకొనివెళ్తున్న బండి కదలడానికి మొడికేసి ముందుకు సాగలేదు. వారు ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు. శిల్పి భోజరాయలకు స్వామి కలలో కనిపించి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాలని ఆదేశించినట్లు, స్వామి ఆజ్ఞానుసారం అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు కథ ప్రచారంలో ఉంది
కొండపై కోనేరు....
అభయాంజనేయ స్వామి ఆలయానికి తూర్పు దిశలో కొండపై కోనేరు ఉంది. ఆ కోనేటిలో స్నానం చేసి స్వామి చుట్టూ 21 రోజుల ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఆపదలో ఉన్నవారికైనా క్షేమం కలుగుతుందని భక్తుల నమ్మకం.
శివుని విగ్రహం.....
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో 24 అడుగుల ఎత్తుగల శివుని విగ్రహం ఉంది. అభయాంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు శివుని విగ్రహాన్ని కూడా దర్శిస్తారు.ప్రతి సంవత్సరము పుష్య బహుళ ద్వాదశికి అనగా ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం జనవరి లేదా ఫిబ్రవరి మాసాలలో శ్రీ ఆంజనేయస్వామి వారి బ్రహ్మోత్సవాలు 8 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకి చుట్టూ ప్రక్కల గ్రామలనుండే కాకుండా జిల్లా నలుమూలలనుండి అలాగే నాగర్కర్నూల్ జిల్లా, మహబూబ్నగర్, గద్వాల (జోగులాంబ), వనపర్తి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు.
🌹. స్మశాన నారాయణుని ఆలయం, అలంపూర్ - విశిష్టత🌹
స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి. 1. కాశీ, 2. పాపనాశి ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)
అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు . అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.
స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....
పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి !
ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు .
స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి. ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును )
అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.
ఈ ఆలయ ప్రాముఖ్యము మా గురువు గారు అయిన తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !
ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని గ్రూపులో పెట్టడం జరిగింది !
చేరుకొనే విధానం :
అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "
ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి !
శ్మశాన నారాయణుడి మోక్షం నారాయణ శ్రద్ద పూజ గురించి సంప్రదించవలసిన ఆలయ పూజారి నంబర్లు : 9440544759, 9491298422.
– కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజెక్టులపై ఎందుకు లేదు– ఆర్డీఎస్ విషయంలో హామీ ఏమైంది– కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్
సామాజికసారథి, జోగుళాంబ గద్వాల: రాష్ట్రంలో అత్యంత అవినీతిపాలన నడుస్తోందని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా డిమాండ్ చేస్తున్న కేసీఆర్ ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి డీపీఆర్ ఎందుకు ఇవ్వడం లేదని…
గద్వాల ఎమ్మెల్యే విషయంలో హైకోర్టు ఉత్తర్వులను పాటించి తక్షణమే.. డీకే అరుణను ఎమ్మెల్యేగా నోటిఫై చేస్తూ గెజిట్ ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. హై కోర్ట్ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి, అసెంబ్లీ కార్యదర్శి కి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ లేఖతో పాటు హైకోర్టు ఉత్తర్వులను జత చేసింది. డీకే అరుణ 2018 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ […]
పచ్చర్ల గ్రామ పంచాయతీ రికార్డుల పరిశీలన
రికార్డులు పరిశీలిస్తున్న అడిట్ అధికారి
జోగులాంబ గద్వాల జిల్లా, రాజోళి మండల కార్యాలయంలో ఇవాళ పచ్చర్ల గ్రామ పంచాయతీ రికార్డ్ పరిశీలన ఎంపీవో ఖాజా పాషా ఆధ్వర్యంలో అడిట్ అధికారి నరేందర్ రెడ్డి నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం జరగాల్సిన పచ్చర్ల జీపీ రికార్డ్ పరిశీలన క్యాష్ బుక్ రెడీ కాలేదని, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వాయిదా పడింది.
ప్రభుత్వ అధికారిక…