Don't wanna be here? Send us removal request.
Text
కరోనా పేరు చెప్పి ఉద్యోగాలు తీయడమేనా విలువలంటే?: రతన్ టాటా
కరోనా పేరు చెప్పి ఉద్యోగాలు తీయడమేనా విలువలంటే?: రతన్ టాటా
కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్న సమయంలో చాలా కంపెనీలు తమ సంస్థల్లో పనిచేస్తున్న వారిని తొలగించేశాయి. పేరున్న కంపెనీలు కూడా ఈ మార్గంలో పయనించడంపై టాటా సంస్థల అధినేత రతన్ టాటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రతన్ టాటా ఏమన్నారంటే: ఒక విపత్తు, ఒక ప్రమాదం సంభవించిన సమయంలో ఒక సంస్థ తమ ఉద్యోగులకు అండగా నిలబడాలి. ఉద్యోగులను ఆదుకునేందుకు చిన్న అవకాశం ఉన్నా దాన్ని విడిచి పెట్టకూడదు.…
View On WordPress
0 notes
Text
ఐపీఎల్ తేదీలు, వేదికలు ఖరారు
ఐపీఎల్ తేదీలు, వేదికలు ఖరారు
అన్ని అవరోధాలను దాటుకొని ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 19న ఈ మెగా ఈవెంట్ ప్రారంభమవుతుండగా, నవంబర్ 8న ఫైనల్తో ముగియనుంది. పూర్తి టోర్నమెంట్ ను నిర్వహించే విధంగా ఈ తేదీలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది.
షార్జా, దుబాయ్, అబుదాబిలు వేదికలుగా మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్…
View On WordPress
0 notes
Text
ఏపీలో రికార్డు బద్దలు కొడుతున్న కేసులు..
ఏపీలో రికార్డు బద్దలు కొడుతున్న కేసులు..
ఏపీలో కరోనా కేసులు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 8,147 మంది కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు అధికార��లు బుల��టెన్ విడుదల చేశారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 80,858కి చేరింది.
ఈరోజు 49 మంది మరణించగా ఇప్పటివరకు మరణాల సంఖ్య 933గా ఉంది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 1029 కేసులు నమోదయ్యాయని అధికారులు…
View On WordPress
0 notes
Text
T20 ప్రపంచకప్ వాయిదా.. బీసీసీఐ ప్లాన్స్ షురూ
T20 ప్రపంచకప్ వాయిదా.. బీసీసీఐ ప్లాన్స్ షురూ
ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే టీ20 ప్రపంచకప్ వాయిదా పడింది. అక్టోబర్ నవంబర్ లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కు తాము ఆతిథ్యమివ్వలేమని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తేల్చి చెప్పేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
ఈ నిర్ణయం వెనకు బీసీసీఐ పూర్తిస్థాయిలో లాబీయింగ్ జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడటంతో బీసీసీఐ భారీస్థాయిలో…
View On WordPress
0 notes
Text
భారత్ @10లక్షలు.. కానీ మనం కోలుకుంటున్నాం
భారత్ @10లక్షలు.. కానీ మనం కోలుకుంటున్నాం
కరోనా మహమ్మారి దేశంలో ఉగ్రరూపం దాలుస్తుంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 34, 956 కొత్త కేసులు, 687 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 10,03,382కు చేరుకుంది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,42,473గా ఉండగా… 6లక్షల 35వేల మందికి పైగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో మరణాలు సంఖ్య 25వేలు దాటిందని కేంద్రం ఆరోగ్యశాఖ…
View On WordPress
#FightAgainstCoronaVirus#highest daily spike in india corona caes#india corona cases hike#india recorded highest single day cases
0 notes
Text
అయ్యో ఉస్మానియా.. ఎన్ని భరిస్తున్నావు!
అయ్యో ఉస్మానియా.. ఎన్ని భరిస్తున్నావు!
తెలంగాణ రాష్ట్రానికే పెద్దాసుపత్రిగా ఉన్న ఉస్మానియా ఆస్పత్రి దుస్థితి మరోసారి బహిర్గతమైంది. నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రిలో కొన్ని వార్డులు నీటితో నిండిపోయాయి. కొన్ని ద్వారాల నుంచి వర్షపు నీరు.. డ్రైనేజీ నీరుతో కలిసి ప్రవహించడంతో ఆస్పత్రిలో వైద్యులు, రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇటీవలే కురిసిన భారీ వర్షానికి కూడా దాదాపు ఉస్మానియాలో ఇలాంటి పరిస్థితే…
View On WordPress
0 notes
Text
AP మంత్రివర్గ నిర్ణయాలు
ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి 31 లోపు కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం తీర్మానించింది. దీనికి పూర్తి బాధ్యతను ఐఎఎస్ లపై ఉంచినట్లు వెల్లడించింది. జిల్లాల ఏర్పాటులో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చూడాలని ఆదేశించింది.
వీటితో పాటు పలు నిర్ణయాలు తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి యాక్ట్ 2006లో 3, 7 సెక్షన్ లను సవరణ…
View On WordPress
0 notes
Text
అనంత పద్మనాభ స్వామి ఆలయం.. ట్రావెన్ కోర్ కుటుంబానికే
అనంత పద్మనాభ స్వామి ఆలయం.. ట్రావెన్ కోర్ కుటుంబానికే
కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యత ట్రావెన్ కోర్ రాజకుటుంబానికే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆలయ నిర్వహణపై రాజకుటుంబానికి ఉన్న హక్కులను సమర్థిస్తూ.. తదుపరి నిర్వహణ కూడా వారికే అప్పగించింది.
అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగల్లో భారీ ఎత్తున నిధులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. వీటి నిర్వహణకు సంబంధించి రాజకుటుంబం అనుమానాస్పదంగా వ్యవహరిస్తుందని…
View On WordPress
0 notes
Text
అప్పుడు సింధియా.. ఇప్పుడు పైలెట్
అప్పుడు సింధియా.. ఇప్పుడు పైలెట్
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇంకా మేల్కొవడం లేదు. ఇప్పటికే తమ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ను బీజేపీకి కోల్పోయిన హస్తం పార్టీ.. ఇప్పుడు రాజస్థాన్ ను కూడా కోల్పోయే పరిస్థితుల్లోకి వెళ్ళింది. ఆ పార్టీ నేత, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడే స్థితికి వెళ్లింది.
రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో సచిన్ పైలెట్ కీలక భూమిక పోషించాడు.…
View On WordPress
0 notes
Text
బ్రేకింగ్: ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆరాధ్యలకు కరోనా
బ్రేకింగ్: ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆరాధ్యలకు కరోనా
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కరోనా వైరస్ బారినపడింది. శనివారం అమితాబ్, అభిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్ గా తేలగా.. తాజాగా ఐశ్వర్యరాయ్ ఆమె కూతురు ఆరాధ్యలకు కూాడా కరోనా నిర్థారణ అయినట్లు తెలుస్తోంది.
నిన్న జరిపిన యాంటీ జెన్ టెస్టుల్లో ఐశ్వర్య, ఆరాధ్య, జయా బచ్చన్ లకు నెగిటివ్ గా రాగా.. ఈరోజు టెస్టు చేసిన RT-PCR టెస్టులో పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు సమాచారం ఉంది. దీంతో అమితాబ్…
View On WordPress
0 notes
Text
గ్రేటర్ లో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు.. ప్రత్యేక అధికారులు!
గ్రేటర్ లో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు.. ప్రత్యేక అధికారులు!
హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు ఓ రేంజ్ లో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ పాతపద్ధతికి శ్రీకారం చుట్టింది. కేసులు భారీగా వస్తున్న సర్కిళ్లను విభజించింది. మొత్తం 8 సర్కిళ్లకు సంబంధించి కొన్ని అత్యధికంగా కేసులు వస్తున్న జోన్లను కంటైన్మెంట్ చేయాలని ఆదేశించింది. వీటికోసం ప్రత్యేకంగా అధికారులను నియమించింది.
ముఖ్యంగా చార్మినార్, యూసఫ్ గూడ, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, కూకట్ పల్లి…
View On WordPress
0 notes
Text
అభిషేక్ బచ్చన్ కు పాజిటివ్.. ఐశ్వర్య, ఆద్య, జయా బచ్చన్ లకు నెగిటివ్
అభిషేక్ బచ్చన్ కు పాజిటివ్.. ఐశ్వర్య, ఆద్య, జయా బచ్చన్ లకు నెగిటివ్
శనివారం రాత్రి బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కుటుంబసభ్యులు టెస్టులు కరోనా టెస్టులు చేయించుకున్నారు. వీరిలో బిగ్ బీ కుమారుడు అభిషేక్ బచ్చన్ కు పాజిటివ్ నిర్థారణ అయినట్లు తెలిసింది.
అభిషేక్ బచ్చన్ కు మాత్రమే పాజిటివ్ గా నిర్థారణ కాగా.. ఐశ్వర్యరాయ్ బచ్చన్, వారి కుమార్తె ఆద్య.. బిగ్ బీ సతీమణి జయాబచ్చన్ లకు నెగిటివ్ గా నిర్థారణ…
View On WordPress
0 notes
Text
ధారావి మోడల్ ను ప్రశంసించిన WHO.. మరిన్ని వార్తలు
ధారావి మోడల్ ను ప్రశంసించిన WHO.. మరిన్ని వార్తలు
ముంబైలోని ధారావిలో కరోనా కేసుల కట్టడిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. అత్యధిక జనసాంద్రత కలిగిన ఈ ప్రాంతంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, ఐసోలేషన్ వంటి పకడ్బందీ చర్యలతో కరోనా కట్టడి చేయగలిగారని చెప్పింది
సచివాలయాన్ని కూల్చడం అనే అంశాన్ని తెరపైకి తెచ్చి కరోనా కట్టడిలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ బీజేపీ నేతలు మండిపడ్డారు
యూపీలో నేటి నుంచి…
View On WordPress
0 notes
Text
జూలై 22 గడువు.. 79 ప్రశ్నలు.. టిక్ టాక్ ఫ్యాన్స్ గెట్ రెడీ
జూలై 22 గడువు.. 79 ప్రశ్నలు.. టిక్ టాక్ ఫ్యాన్స్ గెట్ రెడీ
భద్రతా కారణాలతో ఇటీవల భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్స్ ను నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత యూజర్ల డేటాను చైనాకు తరలిస్తున్నాయన్న ఆరోపణలతో ఈ నిషేధాన్ని ప్రభుత్వం విధించింది.
ఇప్పుడు ఆ యాప్స్ కు సంబంధించిన యాజమాన్యాలకు 79 ప్రశ్నలకు సంబంధించిన వివరణలు అడుగుతూ కేంద్ర ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరణను జూలై 22 వరకు పూర్తిగా ఇవ్వాలని.. లేని పక్షంలో ఈ యాప్ లను…
View On WordPress
0 notes
Text
కరోనా అప్డేట్: తెలంగాణలో 1278 కేసులు,1000కి పైగా డిశ్చార్జి
కరోనా అప్డేట్: తెలంగాణలో 1278 కేసులు,1000కి పైగా డిశ్చార్జి
తెలంగాణ ఈరోజు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 1278 కేసులు పాజిటివ్ గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 32,224కు చేరగా.. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 12,680 గా ఉంది. ఈరోజు 8మరణాలు సంభవించగా.. మొత్తం మరణాల సంఖ్య 339 గా ఉంది.
ఇక జీహెచ్ఎంసీలో 762 కేసులు నమోదవగా.. రంగారెడ్డి 171, మేడ్చల్85, సంగారెడ్డి 36, మెదక్ 22, నల్గొండ 32 కేసులు అత్యధికంగా…
View On WordPress
0 notes
Text
సగం కూల్చినాక ఆపేయడం వల్ల లాభమేంటి?
సగం కూల్చినాక ఆపేయడం వల్ల లాభమేంటి?
తెలంగాణ సచివాలయాన్ని కూలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు సగానికి పైగా బ్లాకులు కూల్చేయడం జరిగిందిని తెలుస్తోంది. ఈ సమయంలో సచివాలయం కూల్చివేతను ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు ఎందుకు ఆపారంటే.
సచివాలయంలోని భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని హైకోర్టు లో ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశర్ రావ్ పిల్ దాఖలు చేశారు. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి భవనాలను…
View On WordPress
0 notes
Text
ప్రభాస్ 20 మూవీ ఫస్ట్ లుక్ విడుదల
ప్రభాస్ 20 మూవీ ఫస్ట్ లుక్ విడుదల
ప్రభాస్ హీరోగా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ విడుదలైంది. రాధే శ్యామ్ అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది.
ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ…
View On WordPress
0 notes